Sat Jun 07 2025 23:28:43 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru Stampade : బెంగళూరు తొక్కిసలాటకు అదే కారణమట.. కావాలనే చేశారా?
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం పోలీసుల నిర్లక్ష్యమే కాదు.. కొందరు కావాలని చేసినట్లు కనపడుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ఫైనల్స్ లో విజయం సాధించిన తర్వాత విక్టరీ పరేడ్ ను బెంగళూరులో నిర్వహించాలనుకున్నారు. ఇది సాధారణ నిర్ణయమే. ఏ జట్టు ఫైనల్స్ లో గెలిచినా ఆ రాష్ట్ర రాజధానిలో కప్పుతో పరేడ్ చేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే బెంగళూరులో విక్టరీ పరేడ్ ఉందని తెలిసిన తర్వాత కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు చెందిన కొందరు చిన్న స్వామి స్టేడియంలో టిక్కెట్లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు గుర్తించారు.
పాస్ లు ఇస్తున్నట్లు ప్రచారం...
అంతేకాదు కొందరయితే చిన్న స్వామి స్టేడియంలోకి వెళ్లాలంటే ఉచిత పాస్ లు కూడా జారీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మనవడి హస్తం ఉందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. టిక్కెట్లు ఎందుకు జారీ చేశారన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కచేస్తున్నారు. స్టేడియం వద్దకు లక్షల సంఖ్యలో భారీగా అభిమానులు చేరతారని ముందుగా అందరూ అంచనా వేసినప్పటికీ ఇంటలిజెన్స్ మాత్రం నిద్రపోతున్నట్లే ఉంది. అందుకే ఇంటలిజెన్స్ చీఫ్ హేమంత్ ను కూడా బదిలీ చేశారు. అదే సమయంలో పెద్ద సంఖయలో వస్తారని తెలిసినా చిన్న స్వామి స్టేడియం గేట్లను ఎందుకు మూసివేశారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
మాజీ సీఎం మనవడి పైనా...
ఇందులో కర్ణాటక రాష్ట్ర సంఘంతో పాటు, ఆర్సీబీపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక మాజీ సీఎం మనవడు, డీఎన్ఏ సంస్థ యజమాని అయిన వెంకట్ వర్థన్ కోసం కూడా పోలీసులు వెదుకుతున్నారు. స్టేడియంలోకి అనుమతి నిరాకరించినా ఎందుకు అక్కడకు అభిమానులు పెద్ద యెత్తున చేరుకున్నారని, ఇందుకు ప్రచారం చేసిన వారు ఎవరన్నదానిపై కూడా కర్ణాటక పోలీసులు కూపీలాగుతున్నారు. మరొకవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యద్శి కె. గోవిందరాజన్ ను కూడా పదవి నుంచి తొలగించారు. ఇప్పటికే ఈ కేసులో కొందరు అరెస్ట్ కాగా మరికొందరి పైన కేసులు నమోదు చేసి పోలీసులు వెదుకుతున్నారు. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మరణించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది
Next Story