Sun Jun 08 2025 00:19:12 GMT+0000 (Coordinated Universal Time)
వారంలో కోటి మందికి రేషన్ సరుకుల పంపిణీ
రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు

రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారం రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరుకులు అందించడం గర్వకారణమని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పౌర సరఫరా విధానంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభమైందన్నారు. ఈ ఏడురోజుల వ్యవధిలో 1,05,27,767 మంది కార్డుదారులకు రేషన్ అందజేశామని నాదెండ్ల తెలిపారు. అంటే దాదాపు 72 శాతం మందికి రేషన్ సరుకులు అందజేశామన్నారు .
పంచదార కూడా...
అదేవిధంగా 98,77,670 మంది కార్డుదారులకు పంచదార పంపిణీ చేశారని శాతం: 67.56% అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇప్పటివరకు 11,05,439 మందికి ఈ విధంగా పంపిణీ చేసినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ తీసుకునే కుటుంబాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నదన్నారు. రేషన్ షాపుల్లో వినియోగదారుల కోసం మరింత సౌకర్యవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని, గతంలో ఉన్న పాత రేషన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.
Next Story